Copyrights Reserved © 2026

prajayuddanouka.com

BREAKING NEWS
తెలంగాణ

చేరుపల్లి యల్లమ్మ మృతి బాధాకరం: మాజీ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్

ప్రతినిధి: నల్గొండ
ప్రచురణ: 12 Aug 2026 05:35 AM
వీక్షణలు: 57 Views
చేరుపల్లి యల్లమ్మ మృతి బాధాకరం: మాజీ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్
ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (నల్గొండ/ దేవరకొండ, ఆగస్టు 11): దేవరకొండ పట్టణానికి చెందిన చేరుపల్లి యల్లమ్మ మృతి చెందడం బాధాకరమని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం దేవరకొండ పట్టణంలోని 10వ వార్డుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే, యల్లమ్మ భౌతికకాయాన్ని దర్శించుకుని పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం శోకసంద్రంలో మునిగిపోయిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. యల్లమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు కొండంత మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నల్లగాసు సత్యనారాయణ, గాజుల రాజేష్, పగడిమర్రి రఘురాములు, నిరంజన్, నజీర్లతో పాటు పలువురు స్థానికులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రజా యుద్ధనౌక
ప్రతి అక్షరం ప్రజల గుండె తడి..
ప్రతి పదం అన్యాయాలపై దాడిగా..
నల్గొండ ఎడిషన్ తేదీ: 20-09-2026 డిజిటల్ ఈ-పేపర్ క్లిప్

చేరుపల్లి యల్లమ్మ మృతి బాధాకరం: మాజీ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్

news image
నల్గొండ, Sep 20 (ప్రజాయుద్ధనౌక న్యూస్): ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (నల్గొండ/ దేవరకొండ, ఆగస్టు 11): దేవరకొండ పట్టణానికి చెందిన చేరుపల్లి యల్లమ్మ మృతి చెందడం బాధాకరమని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం దేవరకొండ పట్టణంలోని 10వ వార్డుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే, యల్లమ్మ భౌతికకాయాన్ని దర్శించుకుని పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం శోకసంద్రంలో మునిగిపోయిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. యల్లమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు కొండంత మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నల్లగాసు సత్యనారాయణ, గాజుల రాజేష్, పగడిమర్రి రఘురాములు, నిరంజన్, నజీర్లతో పాటు పలువురు స్థానికులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.