స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచిన మిత్రులు: రూ.1.40 లక్షల ఆర్థిక సాయం అందజేత
ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (యాదాద్రి భువనగిరి/ మోత్కూరు): మోత్కూరు మున్సిపాలిటీకి చెందిన ఎలిమినేటి సంతోష్ ఇటీవల అకాల మరణం చెందడంతో, ఆయన కుటుంబానికి స్నేహితులు అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు. స్నేహితుడి మృతితో పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు మిత్రులంతా కలిసి రూ.1.40 లక్షల ఆర్థిక సాయాన్ని సేకరించి, సోమవారం సంతోష్ భార్య రజితకు అందజేశారు. ఈ సందర్భంగా మిత్రులు మాట్లాడుతూ.. సంతోష్ హఠాన్మరణం తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆపద సమయంలో స్నేహితుడి కుటుంబానికి తమవంతు బాధ్యతగా ఈ ఆర్థిక సాయం అందించామని, భవిష్యత్తులోనూ ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సంతోష్ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో సంతోష్ స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.