Copyrights Reserved © 2026

prajayuddanouka.com

BREAKING NEWS
తెలంగాణ బ్రేకింగ్

మాదిగ ఉద్యోగుల సమాఖ్య (MEF) నేత వెంకన్నకు పితృవియోగం: రేపు తుంగతుర్తి నియోజకవర్గం పసునూరులో అంతిమ వీడ్కోలు

ప్రతినిధి: సూర్యాపేట
ప్రచురణ: 21 Aug 2026 05:57 PM
వీక్షణలు: 57 Views
మాదిగ ఉద్యోగుల సమాఖ్య (MEF) నేత వెంకన్నకు పితృవియోగం: రేపు తుంగతుర్తి నియోజకవర్గం పసునూరులో అంతిమ వీడ్కోలు

ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (సూర్యాపేట/ తుంగతుర్తి ఆగస్టు 21): తెలంగాణ రాష్ట్ర మాదిగ ఉద్యోగుల వర్కింగ్ ప్రెసిడెంట్, MEF సీనియర్ నాయకులు మల్లెపాక వెంకన్న, ఎమ్మార్పీఎస్ కళామండలి రాష్ట్ర నాయకులు మల్లెపాక నాగర్జున ల తండ్రి మల్లెపాక బిక్షం (21/08/2026) న మధ్యాహ్నం 12:05 గంటలకు అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. బిక్షం గారి మరణవార్త తెలియగానే ఎమ్మార్పీఎస్ (MRPS), ఎంఎస్ఎఫ్ (MSF), MEF, ఎమ్మార్పీఎస్ కళామండలి, ఉద్యోగ, విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, మల్లెపాక కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం లోని పసునూరు గ్రామంలో రేపు శనివారం ఉదయం 11 గంటలకు బిక్షం అంతిమయాత్ర ప్రారంభం కానున్నట్లు వివిధ సంఘాల నేతలు తెలిపారు. మల్లెపాక బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, ఉద్యోగ మరియు విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అంతిమ యాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని సంఘ ప్రతినిధులు కోరారు.

ప్రజా యుద్ధనౌక
ప్రతి అక్షరం ప్రజల గుండె తడి..
ప్రతి పదం అన్యాయాలపై దాడిగా..
తెలంగాణ ఎడిషన్ తేదీ: 25-08-2026 డిజిటల్ ఈ-పేపర్ క్లిప్

మాదిగ ఉద్యోగుల సమాఖ్య (MEF) నేత వెంకన్నకు పితృవియోగం: రేపు తుంగతుర్తి నియోజకవర్గం పసునూరులో అంతిమ వీడ్కోలు

news image
హైదరాబాద్, Aug 25 (ప్రజాయుద్ధనౌక న్యూస్): ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (సూర్యాపేట/ తుంగతుర్తి ఆగస్టు 21): తెలంగాణ రాష్ట్ర మాదిగ ఉద్యోగుల వర్కింగ్ ప్రెసిడెంట్, MEF సీనియర్ నాయకులు మల్లెపాక వెంకన్న, ఎమ్మార్పీఎస్ కళామండలి రాష్ట్ర నాయకులు మల్లెపాక నాగర్జున ల తండ్రి మల్లెపాక బిక్షం (21/08/2026) న మధ్యాహ్నం 12:05 గంటలకు అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. బిక్షం గారి మరణవార్త తెలియగానే ఎమ్మార్పీఎస్ (MRPS), ఎంఎస్ఎఫ్ (MSF), MEF, ఎమ్మార్పీఎస్ కళామండలి, ఉద్యోగ, విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, మల్లెపాక కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం లోని పసునూరు గ్రామంలో రేపు శనివారం ఉదయం 11 గంటలకు బిక్షం అంతిమయాత్ర ప్రారంభం కానున్నట్లు వివిధ సంఘాల నేతలు తెలిపారు. మల్లెపాక బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, ఉద్యోగ మరియు విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అంతిమ యాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని సంఘ ప్రతినిధులు కోరారు.