తెలంగాణ
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే బాలు నాయక్ పయనం
ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (నల్గొండ/ దేవరకొండ ): దేవరకొండ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ సమర్థవంతమైన పాలన అందిస్తున్నారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దేవరకొండ (ఎస్టీ) నియోజకవర్గం నుండి విజయం సాధించిన ఆయన నిరంతరం ప్రజ అందుబాటులో ఉంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. వ్యవసాయం, వ్యాపార రంగాలతో పాటు గ్రాడ్యుయేట్ విద్యా అర్హత కలిగిన బాలు నాయక్, నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించారు. నియోజకవర్గంలోని గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, సాగునీరు, మౌలిక సదుపాయాలు, రహదారులు, విద్య మరియు వైద్య రంగాల అభివృద్ధికి అధికారులతో, నాయకులతో సమన్వయం చేసుకుంటూ ముందడుగు వేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న ఆయన, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును పొందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తూ, దేవరకొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ప్రగతి పథంలో నడిపించడమే తన ప్రధాన ధ్యేయమని బాలు నాయక్ స్పష్టం చేస్తున్నారు.