విద్య
బ్రేకింగ్
బీపీఈడీ, డీపీఈడీ కౌన్సెలింగ్: తగ్గిన విద్యార్థుల ఆసక్తి.. 637 సీట్లు ఖాళీ!
ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (హైదరాబాద్): రాష్ట్రంలోని బీపీఈడీ, యూజీ డీపీఈడీ కోర్సుల భర్తీకి సంబంధించి మొదటి విడత వెబ్ కౌన్సెలింగ్ పూర్తిచేసి, ఆదివారం కేటాయింపులను పూర్తి చేశారు. మొత్తం 1,743 సీట్లు అందుబాటులో ఉండగా, కేవలం 1,400 మందే వెబ్ ఆప్షన్లు ఎంచుకున్నారు. వీరి నుంచి 1,106 మంది విద్యార్థులకు స్థానాలు దక్కాయి. ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థుల నుంచి ఆశించిన స్థాయిలో ఆసక్తి లేకపోవడంతోనే తొలి దశ పూర్తయినా ఇంకా 637 సీట్లు మిగిలిపోయాయని ప్రవేశాల కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు తమకు కేటాయించిన కళాశాలల్లో ఈ నెల 6వ తేదీ నాటికి నేరుగా హాజరై రిపోర్ట్ చేయాలని ఆయన స్పష్టం చేశారు.