మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ 'INDIA' కూటమి
ప్రజాయద్ధనౌక ప్రత్యేక ప్రతినిధి (న్యూఢిల్లీ): కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్ష 'INDIA' కూటమి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. దేశంలో సంచలనం సృష్టిస్తున్న రెండు కీలక అంశాలపై కేంద్ర ప్రభుత్వం సభకు వచ్చి స్పష్టమైన సమాధానం చెప్పాలని ప్రతిపక్ష కూటమి నాయకులు సోమవారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వం ముందు రెండు ప్రధాన డిమాండ్లను ఉంచాయి.
1. విద్యార్థులపై లాఠీచార్జ్, పెల్లెట్ గన్ల ప్రయోగంపై హోంశాఖ వివరణ ఇవ్వాలి
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు జరిపిన తీవ్రమైన లాఠీచార్జ్ మరియు పెల్లెట్ గన్ ప్రయోగాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి. దీనిపై కేంద్ర హోంశాఖ మంత్రి స్వయంగా పార్లమెంట్కు వచ్చి, అసలు విద్యార్థులపై అంతటి కఠిన చర్యలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో పూర్తి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
2. శ్రీరామ మందిర విరాళాల దుర్వినియోగంపై ప్రధాని సమాధానం చెప్పాలి
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కార్యకలాపాలు ప్రధానమంత్రి పర్యవేక్షణ పరిధిలో ఉన్నప్పటికీ, భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించిన ‘చందా’ (విరాళాలు) చోరీకి గురికావడం లేదా దుర్వినియోగం కావడంపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. విరాళాల నిధుల విషయంలో పారదర్శకత లేకపోవడంపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని పట్టుబట్టాయి. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే వరకు తమ పోరాటం ఆపేది లేదని, మోదీ ప్రభుత్వం ప్రజలకు, పార్లమెంట్కు జవాబుదారీగా ఉండాల్సిందేనని 'INDIA' కూటమి నేతలు స్పష్టం చేశారు.