దాస్య శృంఖలాలు తెంచిన దినం – స్వతంత్ర భారత సంబరం
భారతదేశ చరిత్రలో స్వాతంత్ర్య దినోత్సవం నేడు చిరస్మరణీయమైన రోజు దాదాపు రెండు శతాబ్దాల పాటు కొనసాగిన బ్రిటిష్ వారి వలస పాలనకు ముగింపు పలికి, 1947 ఆగస్టు 15న దాస్య శృంఖలాలు తెంచిన దినం మన దేశం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది. ఇది కేవలం ఒక ఉత్సవ దినం మాత్రమే కాదు, కోట్లాది భారతీయుల ఆత్మగౌరవానికి మరియు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు ప్రతీక. ఈ స్వాతంత్ర్యం వెనుక ఎందరో మహనీయుల త్యాగాలు, రక్తతర్పణాలు ఉన్నాయి. మహాత్మా గాంధీ చూపిన అహింస, సత్యాగ్రహ మార్గాల నుంచి సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, అల్లూరి సీతారామరాజు వంటి వీరుల సాయుధ పోరాటాల వరకు ప్రతి ఒక్కరి కృషి అమూల్యమైనది. సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వంటి దార్శనికులు దేశానికి దిశానిర్దేశం చేసి స్వతంత్ర భారతదేశ నిర్మాణానికి బలమైన పునాదులు వేశారు. ప్రతి సంవత్సరం ఈ రోజున దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంటుంది. ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటపై భారత ప్రధానమంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో, నగరాల్లో, గ్రామాల్లో, విద్యాసంస్థలు మరియు కార్యాలయాల్లో త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగురవేస్తారు. విద్యార్థులు, పౌరులు దేశభక్తి గీతాలు ఆలపిస్తూ, సాంస్కృతిక ప్రదర్శనలతో అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటారు. స్వాతంత్ర్యం సాధించి దశాబ్దాలు గడిచినా, దేశాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపడం ప్రతి పౌరుడి కర్తవ్యం. కుల, మత, ప్రాంతీయ భేదాలను విడనాడి, ఐక్యమత్యంతో దేశ సమగ్రతను, శాంతిభద్రతలను కాపాడటమే మనం సమరయోధులకు ఇచ్చే అసలైన నివాళి.
"జయహో భారత్ – వందేమాతరం!"
- ఆర్.ఎన్.ఆర్. అక్షర జ్వాల ✍️