వైద్యం
బ్రేకింగ్
విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా 10 కేసులు
(ఆంధ్రప్రదేశ్):
ప్రజాయుద్ధనౌక ప్రత్యేక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో కొత్తగా 10 కేసులు నమోదయ్యాయి. ఇందులో గుంటూరులో 3, ఎన్టీఆర్ జిల్లాలో 2, అలాగే అల్లూరి, ఏలూరు, కృష్ణా, తిరుపతి, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదైనట్లు వైద్య శాఖ వెల్లడించింది.
దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 49కి చేరింది. ప్రస్తుతం 24 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, మరో 16 మంది ఇళ్ల వద్దే వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, కరోనా మరియు ఇతర కారణాలతో నలుగురు మరణించినట్లు వెల్లడించింది.